ఇడ్లీలు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా! కానీ చాలా సార్లు మనం ఎంత శ్రద్ధగా చేసినా అవి గట్టిగా వస్తుంటాయి. అలాంటి సమయంలో మనకి కోపమేస్తుంది కూడా. మరి ఇలాంటప్పుడే ఈ కొత్త రకమైన సగ్గుబియ్యం ఇడ్లీని ఓసారి ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా, తినగానే నోట్లో వెన్నలా కరిగిపోతాయి. ఒక సారి మీరు ఈ పద్ధతిలో చేసి చూస్తే, మళ్లీ మామూలు విధానంలో ఎప్పుడూ చేయలేరు!
ఈ ఇడ్లీ తయారీకి ముందు మినప్పప్పు, సగ్గుబియ్యం, మెంతులు ఇలా మూడింటినీ ఒకే బౌల్లో వేసి నీటితో బాగా కడగాలి. ఆపై మంచి నీళ్లలో నానబెట్టి పెట్టాలి. అలాగే మరో గిన్నెలో ఇడ్లీ రవ్వ వేసి దాన్నీ కడిగి, ఆరునిమిషాలు నీటితో నానబెట్టాలి. ఈ రెండు మిశ్రమాలు కనీసం ఐదు గంటలు పక్కన పెట్టండి.
నానిన తర్వాత, మినప్పప్పు, సగ్గుబియ్యం, మెంతుల మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బండి. తర్వాత నానబెట్టిన రవ్వను నీరు లేకుండా చేతితో గట్టిగా పిండిలో కలపండి. ఈ పిండిని బాగా కలిపి, మూత పెట్టి రాత్రి పొద్దున వరకూ పులియబెట్టండి.
Related Posts
ఉదయాన్నే ఈ పిండిని తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్లీ బాగా కలపండి. ఇడ్లీ కుక్కర్లో నీరు వేసి మరిగించాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి రాసి, ఈ పిండిని వేసి పది నుండి పన్నెండు నిమిషాల వరకు మీడియం మంటపై ఉడికించండి.
ఇవి ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచి స్పూన్తో తీసేసి హాట్ బాక్స్లో వేడి వేడి పెట్టండి. ఈ సగ్గుబియ్యం ఇడ్లీలు టమోటా పచ్చడి, పల్లీ చట్నీ, సాంబార్తో కలిపి తింటే అదిరిపోతుంది.
ఇలా మీరు ఒక్కసారి చేసినా సరే… మీ కుటుంబం అంతా ఇక ఎప్పటికీ ఈ స్టైల్నే అడుగుతారు. మృదువుగా ఉండే ఈ ఇడ్లీలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా నచ్చుతాయి. ఇలాంటివే కావాలంటే, మీ వంటగదిలో ఈ కొత్త టిప్ని వెంటనే ట్రై చేయండి!