ఉదయాన్నే వేడి వేడి పూరీతో బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎంత బాగుంటుందో చెప్పక్కర్లేదు. కానీ ఇంట్లో చేయగానే పూరీలు బాగా రాకపోవడం, నూనె ఎక్కువ పీల్చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందనే భయంతో చాలామంది బయట హోటల్స్కి పరుగెడుతుంటారు. హోటల్ పూరీలు టేస్టీగా ఉన్నా, అందులో వేసే నూనె మళ్లీ మళ్లీ వాడటంతో ఆరోగ్యానికి హానికరం. అందుకే ఈసారి బయటకి వెళ్లకుండా, ఇంట్లోనే హోటల్ స్టైల్ పూరీ, అదీ తమిళనాడు స్టైల్ గోల్డెన్ పూరీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
ఈ పూరీ ప్రత్యేకత ఏమిటంటే… ఇది తక్కువ ఆయిల్ పీల్చుతుంది. పక్కాగా గట్టిగా పిసిన పిండితో చేస్తే, పూరీలు బాగా ఉప్పొంగి బంగారంలా మెరిసిపోతాయి. గోధుమ పిండి, కొద్దిగా మైదా, బొంబాయి రవ్వ, ఉప్పు వేసి కలిపిన పిండిని తగినంత నీళ్లు పోసి గట్టిగా పిసుకోవాలి. మృదువుగా కాకుండా, గట్టిగా కలిపితేనే పూరీలు ఆయిల్ తక్కువగా పీల్చుతాయి. పిండిని కలిపాక తడి గుడ్డతో కప్పి పక్కన ఉంచండి.
ఇప్పుడు అసలైన మ్యాజిక్ కుర్మాలో ఉంటుంది. ఈ కుర్మా చాలా సింపుల్, టేస్టీ. మొదట ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం తరుగు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. దాంతో కలిపి మందంగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు కలిపి మూతపెట్టి వండాలి. మరిగిన తర్వాత చేత్తో మెదిపిన బంగాళాదుంపలు వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసిన శనగపిండి మిశ్రమాన్ని కలిపి, ఇంకొన్ని నీళ్లు పోసి బాగా కలుపుతూ వండాలి. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే స్పెషల్ కుర్మా రెడీ.
ఇంతలో పిండిని మళ్లీ ముద్దగా చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. బెల్లనం చేసి నూనెలో వేసి పూరీలు వేయించాలి. తెల్లగా ఉండే దశలో తీసేయకుండా బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేయించాలి. అప్పుడు గోల్డెన్ పూరీలు అవుతాయి.
ఈ తమిళనాడు గోల్డెన్ పూరీ, కుర్మా కాంబినేషన్ అంటే కేవలం బ్రేక్ఫాస్ట్కు కాదు, సాయంత్రం కూడా మీకు స్పెషల్ ఫీల్ ఇస్తుంది. ఇంట్లో మనశ్శాంతిగా తినడానికి ఇదొక బెస్ట్ చాయిస్. ఒకసారి ఇలా ట్రై చేస్తే మళ్లీ హోటల్స్ గుర్తు రాకుండా చేస్తుంది.
మరి ఆలస్యం ఎందుకు? ఈ వీకెండ్ స్పెషల్గా ఈ పూరీ, కుర్మా కాంబినేషన్ ట్రై చేయండి. ఇంటివాళ్ల నుంచి పొరుగువాళ్ల వరకు అందరూ మీ వంటకు ఫిదా అవుతారు!