తెలంగాణలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. అనేక జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా, మరికొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. మంగళవారం హైదరాబాద్ నగరం మొత్తం వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు తీవ్రమైన వేడితో బాధపడుతున్న నగర ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
గచ్చిబౌలి, పటాన్చెరు, ఖైరతాబాద్, కూకట్పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, లింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రాబోయే రెండు గంటల్లో నాగర్కర్నూల్, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వడగళ్ల వాన కారణంగా అనేక జిల్లాల్లో భారీ పంట నష్టం సంభవిస్తోంది.
Related Posts
మరోవైపు, రాబోయే కొద్ది రోజుల్లో వేడి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని సమాచారం. వాతావరణంలో వస్తున్న ఈ అనూహ్య మార్పుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.