ఎలక్ట్రిక్‌ కార్లలో కింగ్‌.. ధరను భారీగా పెంచేసింది.. ఎంత పెంచారంటే?

గత కొద్ది రోజులుగా దేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు ఊపందుకున్నాయి. తాజాగా, ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో ఎంజీ మోటార్స్ తెరపైకి వచ్చింది. ఈ కంపెనీకి చెందిన MG కామెట్, MG ZS మరియు MG విండ్సర్ ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాల్లో టాటా కార్లను అధిగమించాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రస్తుతం మార్కెట్‌లో వీటి విక్రయాలు ప్రతినెలా పెరుగుతున్నాయి. దీంతో సీన్ మారిపోయింది. భారతదేశంలో MG మోటార్స్ విడుదల చేసిన విండ్సర్ EV అమ్మకాలలో దూసుకుపోతోంది. ప్రస్తుతం, విండ్సర్ EV అగ్రస్థానంలో కొనసాగుతోంది. వీటన్నింటిని పక్కన పెడితే ఇక నుంచి ఈ కారు కొనే వారికి షాక్ తగులుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఈ విండ్సర్ EV క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్ (CUV) ధర రూ. 50,000. కంటే ఎక్కువ పెరిగింది. గత డిసెంబర్ నెలలో ఈ కారు 10,000 యూనిట్లకు పైగా విక్రయించబడింది. దీనితో, విండ్సర్ EV గత కొన్ని నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఇటీవల డిమాండ్‌తో ధర పెంచారు. దీని ధరను పెంచుతామని కంపెనీ గతంలోనే ప్రకటించింది.

Related News

ఈ కారును బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా అందుబాటులోకి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే. బ్యాటరీ రెంటల్ ప్రోగ్రామ్ కింద దీనిని కేవలం రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కి కొనుగోలు చేయవచ్చు. . దీంతో రూ.3.50. లక్ష చెల్లిస్తే సరిపోతుంది.