ఈరోజుల్లో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీని కారణంగా గుండె సమస్యలు, మధుమేహం, బిపి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊబకాయం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా 119వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. అంతేకాకుండా.. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు.
దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని మోదీ అందరికీ పిలుపునిచ్చారు. WHO డేటా ప్రకారం.. 2022లో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 మిలియన్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రజల్లో అవగాహన కల్పించడానికి పది మందిని నామినేట్ చేస్తూ ఆయన Xలో పోస్ట్ చేశారు. ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని ఆయన కోరారు.
ప్రధాని నామినేట్ చేసిన ప్రముఖులు వీరే..
Related News
1. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా
2. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా
3. ప్రముఖ నటుడు మోహన్ లాల్
4. ప్రముఖ నటుడు మాధవన్
5. నటుడు దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా
6. షూటింగ్ ఛాంపియన్ ఒలింపిక్ విజేత మను భాకర్
7. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను
8. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు నందన్ నీలేకని
9. గాయకురాలు శ్రేయ ఘోషల్
10. రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి