Thalliki Vandanam: 1వ తరగతి లో చేరే పిల్లలకి కూడా తల్లికి వందనం.. మంత్రి లోకేష్ సంచలన ట్వీట్..

నారా లోకేష్ గారు ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థుల తల్లులకు శుభవార్త అందించారు .. రేపటి నుంచి బడులు ప్రారంభం అవుతున్నందున విద్యార్థులు బడికి రెడీ అవుతున్నారు.. మరో పక్క విద్యా శాఖ ప్రతి స్కూల్ కి విద్యార్థి మిత్ర కిట్లు మరియు పాఠ్య పుస్తకాలు ఈ రోజే అందించారు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

స్కూల్ తెరిచిన మొదటి రోజే విద్యార్థికి యూనిఫామ్ కూడా ఇవ్వటానికి అని ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భం గా తల్లికి వందనం గురించి కూడా మంత్రి లోకేష్ గారు ఆనందమైన విషయం చెప్పారు..

తన ట్వీట్ లో మంత్రి గారు ఈ విధం గా స్పందించారు..

Related Posts

విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం.

సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది.