నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత: కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రకటన

ఆరోగ్య శ్రీ ట్రస్టు అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి ఈ కారణం గానే సేవలు నింపివేయాలని నిర్ణయం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అమరావతి: పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

గత ఆగస్టు నుంచి బకాయిపడిన రూ.1500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీశ ప్రకటించడంతో మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీశ చర్చించారు.

Related News

బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఈవో తెలిపారు. గతంలో ఇదే విషయాన్ని చెప్పినా బిల్లులు చెల్లించలేదని ప్రజాప్రతినిధులు వాపోయారు. బిల్లుల చెల్లింపునకు నిర్దిష్ట చర్యలు తీసుకోనందున బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులు తీసుకోబోమని ఆశా కార్యనిర్వాహక అధ్యక్షుడు వై.రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ ఒక ప్రకటనలో తెలిపారు.

బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించబోమని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు కూడా ప్రకటించాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఘం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్-19 కింద అందించిన చికిత్స బిల్లులు, ఆరోగ్యశ్రీ బిల్లులు సుమారు మూడేళ్లుగా ప్రభుత్వం చెల్లించలేదు.

బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించబోమన్నారు. మందుల ఖర్చు పూర్తిగా భరించేందుకు సిద్ధంగా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నాం. రోగనిర్ధారణ పరీక్షలపై 50% తగ్గింపు. శస్త్రచికిత్సలు ఉచితం. ఇప్పటికే ఇన్ పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తాం. అని తెలియజేసారు .

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *