Volunteers: వాలంటీర్లపై టీడీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వాలంటీర్లు క‌నిపించార‌న‌డంలో సందేహం లేదు. YCP  అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఎన్నికల్లో YCP కి volunteers  మద్దతిస్తారంటూ ఆమె ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో volunteers కు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

TDP  ఫిర్యాదు మేరకే ఈసీ ఆంక్షలు విధించిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే volunteers వ్యవస్థను రద్దు చేస్తోందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈసీ ఆంక్షలు విధించడంతో పలువురు వలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి YCP కి మద్దతుగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో YCP  ఓడిపోవడంతో వాలంటీర్లు మాట మార్చారు. YCP నేతలు కొందరు తమ నుంచి బలవంతంగా రాజీనామా చేయించారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని volunteers  డిమాండ్ చేస్తున్నారు.

Related Posts

దీనిపై తాజాగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. మీడియాతో రాష్ట్రంలో volunteers system  కొనసాగిస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోబోమని మంత్రి తేల్చి చెప్పారు. రాజీనామాలు చేయకుండా ఉద్యోగంలో ఉన్న volunteers తో కలిసి పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.YCP సానుభూతిపరులన్న ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన volunteers ను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.