AP కి మళ్ళీ వర్షం : ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. మరోసారి భారీ వర్ష సూచన..

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా పయనించి 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల దగ్గర తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది

అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Related News

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 కి.మీ. సోమవారం కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం వరకు వర్షాలు కురవకపోవచ్చని హెచ్చరించింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *