PM Kisan: నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల..

రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే ప్రధానమంత్రి కిసాన్ నిధులు నేడు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నిధులను విడుదల చేయనున్నారు. బీహార్‌లోని భాగల్పూర్‌లో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రైతులకు రూ.22 వేల కోట్ల విలువైన 19వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.2 వేల చొప్పున 3 విడతలుగా రూ.6 వేలు సహాయం చేస్తోంది. 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కేంద్రం ఇప్పటివరకు 18 విడతలుగా రూ.3.46 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now