ఎనిమిదేళ్ల గారెంటీ తో ఓలా Ev స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 198 Km.

పెట్రో ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయం గా పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ప్రజలను ఆకర్షించడానికి, అనేక ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు తక్కువ ధర మరియు మంచి ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తెస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వారు బడ్జెట్ ధరలో అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్లో అతిపెద్ద ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కొత్త మోడల్ను విడుదల చేసింది. ఓలా S1X 4Kwh పేరుతో కొత్త స్కూటర్ను విడుదల చేసింది.

ఈ మోడల్ స్కూటర్ అధిక కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 198K M రేంజ్ను అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలను ఓలా ప్రకటించింది. ఈ వాహనం 3.3 సెకన్లలో సున్నా నుండి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

Related News

ఇది గరిష్టంగా గంటకు 90K M వేగంతో వెళ్లగలదు. 6kw సామర్థ్యం కలిగిన మోటారు 8bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్లో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ వంటి మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి.

తమ ఉత్పత్తులైన ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్పై 8 సంవత్సరాలు/80,000K M వారంటీని అందిస్తున్నామని, అదనంగా 5000 చెల్లిస్తే లక్షK M వరకు వారంటీ ఉంటుందని తెలిపారు.

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మరియు ఎండీ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ తమ ఉత్పత్తులపై ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించడం, నెట్వర్క్ ఛార్జింగ్ మరియు బ్యాటరీ వారంటీని అధిగమించి ముందుకు సాగుతున్నామని చెప్పారు.

Ola S1 ప్రో మరియు S1 ఎయిర్ ఇప్పటికే EV మార్కెట్లో అద్భుతమైన స్పందనను పొందుతున్నాయి. అదే క్రమంలో, Ola S1X 4Kwh ఇప్పుడు ప్రీమియం వెర్షన్లో అందుబాటులో ఉంది. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ వెహికల్.