8వ పే కమీషన్ ముందే సెంట్రల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.18,000 జీతానికి కొత్తగా రూ.1,080…

మార్చి 28న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద శుభవార్త వచ్చింది. ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను 2% పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త DA జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ద్వారా 1 కోటికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లాభం చేకూరనుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఎప్పుడు వస్తాయ్ DA అరియర్స్?

సాధారణంగా DA పెంపు ప్రకటన హోలీ లేదా దీపావళికి ముందు వస్తుంది. కానీ ఈసారి జనవరి-జూన్ DA పెంపు మర్చి చివర్లో వెల్లడైంది. గత ఏడేళ్లలో ఇదే తక్కువ పెంపు – కేవలం 2%. గతంలో 3% లేదా 4% పెంచేవారు. ప్రస్తుతం 53% ఉన్న DA, ఇప్పుడు 55%కి పెరిగింది.

జీతంలో ఎంత పెరుగుతుంది?

7వ పే కమీషన్ ప్రకారం కనిష్ఠ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం రూ.18,000. అందులో 2% DA అంటే నెలకి రూ.360 అదనంగా వస్తుంది. జనవరి నుంచి మార్చి 2025 వరకూ మూడు నెలల అరియర్స్ అంటే రూ.1,080 వస్తుంది. అలాగే రూ.9,000 పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్లకు రూ.540 అరియర్స్ వస్తుంది. ఈ మొత్తాన్ని ఏప్రిల్ 2025లో జీతం లేదా పెన్షన్‌తో చెల్లిస్తారు.

Related News

8వ పే కమీషన్ ప్రకటన తర్వాత తొలి DA పెంపు

జనవరి 16, 2025న కేంద్రం 8వ పే కమీషన్‌ను ప్రకటించింది. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. కమీషన్ సిఫారసులు ఇవ్వడానికి సుమారు 15-18 నెలలు పడుతుంది. అందువల్ల 2025 జూలై-డిసెంబర్ DA పెంపు 7వ కమీషన్ కింద చివరిది అవుతుంది. దీన్ని అక్టోబర్-నవంబర్‌లో ప్రకటించే అవకాశం ఉంది.

ఉద్యోగుల కోసం ఊరట – పెన్షన్‌లకు ఊపిరి

ఇప్పుడు పెరిగిన DA, మూడు నెలల అరియర్స్ ఏప్రిల్‌లో రావడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు కొంత ఊరట పొందుతారు. ఇకపై సర్వేలు, నివేదికలు సిద్ధమైన తర్వాత 8వ కమీషన్ ద్వారా జీతాలు, పెన్షన్లు మరింతగా పెరిగే అవకాశముంది. కనుక ఇప్పుడు వచ్చిన DAతో పాటు రానున్న 8వ కమీషన్ పై కూడా కేంద్ర ఉద్యోగుల కళ్లన్నీ ఉన్నాయి.

ఇంకేం ఆలస్యం? రూ.18,000 పెట్టుబడికి ఇప్పుడు రూ.1,080 అదనంగా వస్తోంది… రేపటి జీతం ఇంకా పెద్దదే.