MINISTER: మంత్రి కీలక ప్రకటన..అర్హులైన ప్రతి రైతుకు రూ.20వేలు..!!

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు (సోమవారం) జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశంలో మంత్రి అచ్చన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు అందజేస్తామని మంత్రి అచ్చన్నాయుడు మరోసారి అసెంబ్లీలో ప్రకటించారు. అర్హత ఉన్న ప్రతి పేద రైతుకు పరిహారం అందుతుందని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బుతో పాటు బ్యాంకుల్లో జమ చేస్తామని ఆయన వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ పథకం రైతులకు, వెబ్ ల్యాండ్‌లో నమోదైన వారికి వర్తిస్తుందని అన్నారు. గత ఐదేళ్లలో వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక్క కార్యక్రమం కూడా జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల విషయంలో కూడా వారిని మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంతో కలిసి హామీలను నెరవేరుస్తున్నామని ఆయన అన్నారు. ఈ ప్రక్రియలో సంకీర్ణ ప్రభుత్వం (ఏపీ ప్రభుత్వం) అన్నదాతలకు మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.