మీ దగ్గర రూ.1 లక్ష పెట్టుబడి ఉంటే… అది అలానే పెట్టకుండా, 100% ప్రభుత్వం గ్యారంటీతో రూ.2 లక్షలుగా మారితే ఎలా ఉంటుంది? ఇది ఫేక్ ఆఫర్ కాదు, ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రం (KVP) స్కీమ్ ద్వారా సాధ్యం అవుతుంది. చాలా మంది దీన్ని గురించి పూర్తిగా తెలుసుకోకుండా వదిలేస్తున్నారు. కానీ ఈ చిన్న స్కీమ్లో దాచిన డబ్బు భవిష్యత్తులో బిగ్ బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోంది. అందుకే ఇందులో పెట్టే డబ్బు పూర్తిగా సురక్షితం. ఇది గ్రామీణులు, రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు ఇలా ఎవరికైనా ఉపయోగపడేలా డిజైన్ చేశారు. మీరు పోస్ట్ ఆఫీస్లో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టొచ్చు. కానీ నిజమైన లాభం కావాలంటే రూ.1 లక్ష వేశారు అన్నపుడు, 115 నెలల తర్వాత అది రూ.2 లక్షలుగా మీ చేతికి వస్తుంది.
ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే — ఇది ఫిక్స్డ్ రిటర్న్స్ స్కీమ్. అంటే మీరు ఎంత డబ్బు పెట్టారో దాని డబుల్ రాబడి ఖచ్చితంగా వస్తుంది. మార్కెట్ రిస్క్ ఉండదు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు లాంటి వాటిలో ఉండే టెన్షన్ ఇందులో ఉండదు. ఇందులో పెట్టుబడి వేసి మీ పిల్లల చదువులకు, భవిష్యత్ ఖర్చులకు, ఎమర్జెన్సీ అవసరాలకు సేఫ్ ప్లాన్గా మలచుకోవచ్చు.
Related News
మూడు రకాల సర్టిఫికెట్లు
ఒక్కోటి వేర్వేరుగా ఉపయోగపడుతుంది. మీరు ఒంటరిగా ఓపెన్ చేయాలంటే సింగిల్ హోల్డింగ్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. పిల్లల పేరుతో పెట్టాలంటే మైనర్ పేరిట ఓపెన్ చేయొచ్చు. ఇద్దరు కలిసి పెట్టాలంటే జాయింట్ A లేదా B టైప్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఇందులో ఇద్దరినీ పేర్లతో నమోదు చేస్తారు. భవిష్యత్తులో ఒకరి మృతితో మరొకరికి డబ్బు ఇబ్బంది లేకుండా చెల్లిస్తారు.
ఈ స్కీమ్లో ఖాతా ఓపెన్ చేయాలంటే మీరు భారతీయ పౌరుడై ఉండాలి. కనీస వయస్సు 18 ఏళ్లు కావాలి. మైనర్ పేరుతో ఖాతా ఓపెన్ చేయాలంటే అతడి వారసుడిగా ఓ పెద్దవారు ఖాతా నిర్వహించాలి.
పన్ను ప్రయోజనం కూడా
ఈ స్కీమ్పై సెక్షన్ 80C ప్రకారం రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. అంటే పొదుపు మాత్రమే కాదు, పన్ను లాభం కూడా. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్. వెంటనే డబ్బు కావాలనుకునే వారికి ఇది కాదు. కానీ భవిష్యత్తులో ఖచ్చితమైన డబ్బు కావాలనుకునే వారికి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.
ఎక్కడ దరఖాస్తు చేయాలి?
మీరు నివసించే ఏ పోస్ట్ ఆఫీస్కి అయినా వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. అక్కడ మీకు పూర్తిగా వివరాలు కూడా చెప్తారు. ఆధార్, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ ఇచ్చి వెంటనే ఖాతా ఓపెన్ చేయవచ్చు.
ఇంత వరకు చదివిన తర్వాత మీకే ఓ ప్రశ్న రావచ్చు… ‘‘ఇవ్వాళ రూ.1 లక్ష పెట్టగలిగితే, భవిష్యత్తులో రూ.2 లక్షలు డబుల్ రాబడి రావడం అంటే ఏ బెటర్ ప్లాన్ కావచ్చు?’’ అనేది నిజం! కాబట్టి ఆలస్యం ఎందుకు? ఇది ఓల్డ్ స్కీమ్ అయినా, లాభాలు మాత్రం నేటి స్కీమ్స్ కంటే మిన్నగానే ఉంటాయి.
ఈ రోజుల్లో డబ్బు పెట్టే చోట్లు ఎన్నో ఉన్నా, ప్రభుత్వ హామీ ఉన్న స్కీమ్లు చాలా కొద్దివే. అందులో కిసాన్ వికాస్ పత్రం ముందు వరుసలో ఉంది. మీ డబ్బును సేఫ్గా పెంచుకునేందుకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి.
ఈ స్కీమ్ గురించి ఇంకా తెలియని వారికి షేర్ చేయండి. మీరు ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం మీ భవిష్యత్తును సేఫ్ చేస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్కి వెళ్లి ఈ స్కీమ్లో మీరు కూడా ఒక మెంబర్ కావండి!