Jana Sena : మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు.. ఎక్కడంటే..?

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. మార్చి 14న దీన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని యోచిస్తోంది. దీనికి పార్టీ నాయకులు సన్నాహాలు ప్రారంభించారు. ఈసారి పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. అదే రోజు పిఠాపురంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఈ మేరకు ఇప్పటి నుంచి కార్యక్రమం పనులపై దృష్టి సారించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇదే సమయంలో జనసేన పార్టీ మార్చి 14, 2014న ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లోని మాదాపూర్ నోవాటెల్ భవనంలో పార్టీ ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందని ప్రకటించారు. పార్టీ స్థాపించి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ వేడుకలను కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన జనసేన పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.