RAIN ALERT: తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వడగండ్ల వాన..

ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా మంగళవారం (మే 7) నుండి శనివారం (మే 11) వరకు ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.

ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా కలిగే అసౌకర్యాలను ఎదుర్కొనేందుకు రైతులు, రవాణా రంగం మరియు సాధారణ ప్రజలు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు. ఈదురుగాలులు, వడగళ్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

Related News