Bumper Car Offer: కొత్త కారు కొనేవారికి కేంద్రం గుడ్‌న్యూస్.. భారీ డిస్కౌంట్!

నేషనల్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ: కొత్త కార్ల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త కార్లపై భారీ తగ్గింపునకు కేంద్రం ముందుకు వచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. వాణిజ్య మరియు ప్రయాణీకుల వాహనాల తయారీ కంపెనీలు కొత్త వాహనాల అమ్మకాలపై తగ్గింపును అందించడానికి అంగీకరించాయి. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది.

కొత్త కారు, కమర్షియల్ వెహికల్ కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ రాయితీలు ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ తగ్గింపు కొన్ని షరతులకు లోబడి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కార్ కంపెనీలు తమ పాత వాహనాన్ని స్క్రాపింగ్ కోసం సమర్పించిన తర్వాత జారీ చేసిన చెల్లుబాటు అయ్యే డిపాజిట్ సర్టిఫికేట్ ఉన్నవారికి మాత్రమే డిస్కౌంట్లను ఇస్తాయి. స్క్రాప్ విధానానికి కంపెనీలు కూడా అంగీకరించాయని తెలిపారు.

Related News

నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండప్‌లో మంగళవారం జరిగిన పరిశ్రమల సమాఖ్య సియామ్ (సియామ్) సీఈవోల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు దేశంలో 1000కి పైగా వాహనాల స్క్రాపింగ్ సెంటర్లు, 400కి పైగా ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్ట్ సెంటర్లు అవసరమని నితిన్ గడ్కరీ గతేడాది చెప్పిన సంగతి తెలిసిందే.

నేషనల్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అన్ని వాటాదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు. దక్షిణాసియాలోనే భారత్‌ అతిపెద్ద స్క్రాపింగ్‌ హబ్‌గా అవతరించనుందన్నారు. సర్క్యులర్ ఎకానమీ కీలకమని, ఇది దేశంలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 2021లో నేషనల్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *