DA Hike: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 4 శాతం డీఏ పెంపు .. జనవరి 1 నుంచే అమలు

డీఏ పెంపు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్‌నెస్ రిలీఫ్ డియర్‌నెస్ రిలీఫ్‌లో 4 శాతం పెరుగుదలను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు తెలిపారు. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగులకు డీఏ 4 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. 4 శాతం పెంచిన డీఈ జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానుంది.ఆ బకాయిలను వచ్చే నెల జీతంతో కలిపి కేంద్రం చెల్లిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. వచ్చే నెల నుంచి జీతాలు, పింఛన్లు భారీగా పెరగనున్నాయి. మరోవైపు డీఏ పెంపుతో పాటు గ్రాట్యుటీ, ఇతర అలవెన్సులు కూడా పెంచుతున్నారు. అయితే దీనిపై కేంద్ర మంత్రి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, కేబినెట్ నిర్ణయాలు పూర్తిస్థాయిలో బయటకు వస్తే మాత్రం క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించిందని చెప్పవచ్చు.

మరోవైపు, క్యాబినెట్ కీలక నిర్ణయాలలో, ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ ఉజ్వల యోజన ద్వారా అందించే రూ.300 సబ్సిడీ పథకాన్ని మార్చి 31, 2025 వరకు పొడిగించడానికి ఆమోదించింది. ఇది కేంద్రంపై భారం పడుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మరో రూ.12 వేల కోట్లు. మరోవైపు, 2024-25 సీజన్‌కు జనపనార కనీస మద్దతు ధరను పెంచుతున్నారు. క్విటాల్‌కు రూ.285 పెంచినట్లు తెలిపారు. దీంతో క్విటాలు జూట్ ధర రూ. 5,335కి చేరింది.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *