కేంద్రం బంపర్ స్కీమ్.. ప్రతి విద్యార్థి ఈజీ గా రూ.4 లక్షలు పొందే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ చాలా పథకాలకు సరైన ప్రచారం లేదు. అయితే కేంద్రం అమలు చేస్తున్న కొన్ని పథకాలు విద్యార్థులకుఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మోదీ ప్రభుత్వం వృత్తి విద్య, శిక్షణ రుణ పథకం పేరుతో ఒక పథకాన్ని అమలు చేయడం గమనార్హం.

యువతకు ఆర్థిక సాయం చేయాలనే మంచి ఆలోచనతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని సులభంగా ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే మొత్తాన్ని వృత్తి విద్య, శిక్షణ కోర్సులకు వినియోగించుకోవచ్చు. విద్యార్థులు ఇతర ఖర్చుల కోసం కూడా ఈ పథకం కింద నిధులను ఉపయోగించవచ్చు.

విద్యార్థి అవసరాలను బట్టి రుణం మంజూరు చేయబడుతుంది మరియు గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. ఈ పథకం విషయంలో రుణం ఇచ్చే సంస్థను బట్టి వడ్డీ రేటు మారుతుంది. తీసుకున్న రుణాన్ని 7 ఏళ్లలోపు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఎవరు రుణం తీసుకున్నా 7 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించాలి.

స్టేట్ స్కిల్ కార్పొరేషన్ సపోర్టు చేసే సంస్థలో అడ్మిషన్ పొందిన వారు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పవచ్చు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్, నివాస ధృవీకరణ పత్రం, ఖాతా వివరాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *