BREAKING: చంద్రబాబు మరో సంచలన నిర్ణయం.. కీలక పథకం పేరు మార్పు

Andhra Pradesh లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పరాజయం పాలైంది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు మరో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు నిర్ణయాల్లో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మార్పులు చేయనుంది. సీఎం చంద్రబాబు తనదైన శైలిలో బ్రాండ్ పాలనతో దూసుకుపోతున్నారు.

ఇందులో భాగంగా Jagananna Vidya Kanuka Scheme పేరును Student Kit గా మార్చిన చంద్రబాబు సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఇతరులకు ఆర్థిక సాయం అందించేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం YSR Asara Pension Scheme ప్రవేశపెట్టింది. తాజాగా ఈ పథకం పేరును ప్రభుత్వం మార్చింది. YSR Asara Pension Scheme పేరును తొలగించి మళ్లీ NTR Bharosa scheme గా నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరభ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో పెన్షనర్లకు కీలక హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వస్తే నెలకు రూ.4 వేల పింఛను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం పింఛను పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *