కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై ప్రసంగం ప్రారంభించిన వెంటనే ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
వివిధ రంగాలకు కేటాయింపుల గురించి ఆమె మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పాత్ర ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 జిల్లా కేంద్రాలలో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పిస్తామని కూడా ప్రకటించారు. కోటి మంది గిగ్ వర్కర్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.