రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పలు బ్యాంకు ఖాతాలను మూసివేయనున్నట్టు ప్రకటించింది.
స్కామ్లను అరికట్టేందుకు, బ్యాంకింగ్ కార్యకలాపాల్లోని లోపాలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ మార్పులు అమలు చేస్తున్నామని, ఈ మార్పు కస్టమర్లు డిజిటల్ బ్యాంకింగ్ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తుందని ఆర్బీఐ తెలిపింది.
ఈ మూడు రకాల బ్యాంకు ఖాతాలను ఆర్బీఐ మూసివేస్తోంది.
Related News
డోర్మాంట్ ఖాతాలు: డోర్మాంట్ అకౌంట్స్ అంటే ఎక్కువ కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలు. అంటే, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలను నిష్క్రియ ఖాతాలుగా పరిగణిస్తారు.
నిష్క్రియ బ్యాంక్ ఖాతా: ఒక సంవత్సరం పాటు ఎటువంటి లావాదేవీ లేదా యాక్టివేషన్ జరగని ఖాతా.
జీరో బ్యాలెన్స్ ఖాతా: చాలా కాలంగా డబ్బు డిపాజిట్ చేయని మరియు జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతా.