వైజాగ్ బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై తేలియాడేందుకు మీరు సిద్ధమా..

అందాల నగరమైన విశాఖలో అడుగడుగునా ఏదో తెలియని ఆనందం హృదయాన్ని హత్తుకుంటుంది. తీర అందాలు.. ఎగసిపడే అలలు.. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇక్కడి పర్యాటక అందాలను మరింతగా పెంచేందుకు Visakha Tourism Department విశాఖలోని విశాలమైనbeach ను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. మరో పది రోజుల్లో ఈ floating bridge పర్యాటకులకు అందుబాటులోకి వస్తుందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు విశాఖపట్నం కేంద్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. పచ్చదనంతో నిండిన విశాఖ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపే ప్రతి క్షణం ఎన్నో మధురమైన అనుభూతులను ఇస్తుంది. రామకృష్ణ బీచ్, కైలాసగిరి, తొట్లకొండ, డచ్ సమాధులు, రుషికొండ బీచ్, భీమిలి తదితర ప్రాంతాలకు విశాఖపట్నం పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశం. తాజాగా ఈ జాబితాలోకి మరో కొత్త అతిథి రాబోతున్నాడు. అదే తేలియాడే వంతెన. ఎగిసిపడుతున్న అలలపై తేలియాడుతూ కడలి అందాలను దగ్గరగా చూడాలనుకునే వారికి ఈ తేలియాడే వంతెన వారధిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

The feeling cannot be described in words.

Visakha Metropolitan Region Development Authority (VMRDA) ఈ project చేపట్టింది. ఇప్పటికే రెండు వారాల నుంచి ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి. మరో పది రోజుల్లో తేలియాడే వంతెన అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వంతెన వినియోగంలోకి వస్తే Visakha tourism కు ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా మారుతుందని విశాఖ వాసులు చెబుతున్నారు.

ఇది RK Beach నుండి Park Hotel మధ్యలో Cocoa Gardens సమీపంలో Kursura Submarine పక్కన ఉండబోతోంది. అలలపై తేలియాడే వంతెన నిర్మాణం మరో రెండు వారాల్లో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వంతెన plastic blocksలతో తీరం నుండి సముద్రానికి అరకిలోమీటర్ దూరంలో ఉంది. అలలు వచ్చినప్పుడు ఈ వంతెనపై నిలబడే అనుభూతిని వర్ణించడం కష్టం.

Safety jackets are mandatory..

మొదట కెరటాల మధ్యలో ప్రారంభమై అలలు దాదాపు విరుచుకుపడే స్థాయికి చేరుకోవచ్చు. ఈ project ప్రారంభించిన తర్వాత, దీని ప్రవేశ రుసుము గురించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే పర్యాటకులకు గిట్టుబాటు ధర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.100గా అంచనా వేయబడింది.

అయితే ఈ తేలియాడే వంతెనపై వెళ్లే వారికి safety jackets తప్పనిసరి. వీటిని నిర్వాహకులు అందజేస్తారు. ఇవి లేకుండా floating bridge అనుమతించే అవకాశం లేదని సమాచారం. మరి float ప్రాజెక్టుగా నగరంలోకి ప్రవేశిస్తున్న floating bridge పై పర్యాటకులు ఎలా తేలతారో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *