ఇంట్లో ఉంటూ.. నెలకు రూ.45 వేలు సంపాదించే బిజినెస్!

ఈ మధ్య కాలంలో మట్టి పాత్రల వాడకం ఎంతగా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ మట్టి పాత్రల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండడంతో అందరూ ఈ మట్టి పాత్రలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో.. గతంలో ఎన్నడూ లేనివిధంగా పలు ఇళ్లలో ఈ మట్టి పాత్రల వినియోగం క్రమంగా పెరిగింది. అంతేకాదు.. ఇప్పుడు రోడ్డుపై కూడా ఎక్కడికి వెళ్లినా మట్టి కుండల్లోనే ఆహారాన్ని విక్రయిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇదిలావుంటే.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారం చేయాలని కలలు కంటారు. మరి, అలాంటి వారికి ఈ కుండల best business అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.

పూర్వం మన ఇళ్లలో మట్టి కుండలను వంట సామాగ్రిగా ఉపయోగించేవారు. కానీ తర్వాతి కాలంలో వీటి వాడకం బాగా తగ్గిపోయింది. Plastic and steel వినియోగిస్తున్నారు. కానీ, ఇటీవలి కాలంలో మట్టిపాత్రలు వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్న అవగహన పెరిగి క్రమంగా వాటిని వాడడం మొదలుపెట్టారు. కానీ గతంతో పోలిస్తే చాలా నగరాల్లో ఈ మట్టి పాత్రల వినియోగం పెరిగిపోయిందని చెప్పవచ్చు.

Related News

ప్రస్తుతం మార్కెట్ లో రూ.150 నుంచి రూ.1500 వరకు పలు రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంట్లోనే మట్టి కుండలను తయారు చేసి వివిధ మార్కెటింగ్ పద్ధతులను ఉపయోగించి విక్రయిస్తే మంచి లాభాలు పొందవచ్చు. కానీ వారికి కావాల్సింది మట్టి, బొగ్గు మరియు కాల్చడానికి కలప.

ఆ కుండల తయారీకి కుమ్మరి చక్రం ఉంటే చాలు. దీని ద్వారా మట్టి కుండల నుంచి మట్టి గాజులు, పాత్రలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు మార్కెట్లో చిన్న దుకాణాన్ని తెరిచి వాటిని అమ్మవచ్చు. వాటిని ఆన్లైన్లో కూడా విక్రయించవచ్చు. కాకపోతే దాదాపు యాభై, ఆరు వేలు ఖర్చు పెట్టాలి. దీనికి కొంత ప్రయత్నం పడుతుంది. అంతేకాదు..ఈ మట్టి కుండల్లో ఆర్గానిక్ ఫుడ్ అమ్మడం వల్ల నెలకు దాదాపు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు సులభంగా సంపాదించవచ్చు.

వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లయితే ఇంటి నుంచే ఈ మట్టి కుండల వ్యాపారాన్ని ప్రారంభించి నెలకు రూ.45 వేల వరకు సంపాదించండి. ఇక వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ మట్టితో చేసిన వ్యాపారం ఇంటి నుంచే లాభాలు తెచ్చిపెడుతుంది