నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడైంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానాంలోని దిగువ ట్రోపో ప్రాంతంలో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా, రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వాతావరణ సూచన ఏమిటో తెలుసుకోండి..
ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్, యానాం:-
శని, ఆది, సోమవారాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు – గంటకు 40 -50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్య వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
Related Posts
దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్:-
ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 -50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్య వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ :-
ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 -50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్య వాతావరణం ఉండే అవకాశం ఉంది.