భారతదేశంలో మహిళల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో లఖ్పతి దీదీ పథకం ఒకటి. . ఈ పథకం ద్వారా, ప్రభుత్వం మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది. అయితే ఈ పథకం కింద రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఎలా పొందాలి?… ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం…
భారతదేశంలో మహిళల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో లఖ్పతి దీదీ పథకం ఒకటి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2023లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళా సాధికారత మరియు గ్రామీణ ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా, ప్రభుత్వం మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది. కానీ ఈ పథకం కింద రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఎలా పొందాలి? దీనికి అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన పత్రాలు ఏమిటి, ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం…
రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం పొందడానికి అర్హత ప్రమాణాలు ఈ విధంగా ఉన్నాయి… స్వయం సహాయక సంఘాల సభ్యులుగా ఉన్న మహిళలు ఈ పథకం కింద రుణం పొందడానికి అర్హులు. లఖ్పతి దీదీ యోజనకు దరఖాస్తు చేసుకోవడానికి.. మహిళలు కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ ఫోటో, SGH సభ్యత్వ కార్డు, ఫోన్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం, పాన్ కార్డ్.. వంటి అవసరమైన పత్రాలు అందుబాటులో ఉండాలి. మహిళలు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మహిళల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఒక మహిళ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకుంటే… ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. అలా అయితే, వారు ఈ పథకానికి అనర్హులు అవుతారు.
Related Posts
ఈ పథకం కింద 3 కోట్ల మంది మహిళలకు రుణాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే.. జిల్లాలోని మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ కార్యాలయ అధికారులను సంప్రదించాలి. లఖ్పతి దీదీ పథకం: అభ్యర్థులు ఫార్మ్ నింపి అవసరమైన పత్రాలు మరియు వ్యాపార ప్రణాళికను సమర్పించాలి. అయితే, వారి దరఖాస్తును ప్రభుత్వ అధికారులు సమీక్షిస్తారు. వారు అర్హులైతే, వారికి వడ్డీ లేని రుణం మంజూరు చేయబడుతుంది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద వారికి వివిధ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.