DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కీలక ప్రకటన..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సంకీర్ణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఫైల్ పై తొలి సంతకం చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే, మెగా డీఎస్సీతో పాటు టెట్ పరీక్షలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.. ఆ తర్వాత ముందుగా టెట్ నిర్వహించి, ఆ తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అధికారులు దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నందున పరీక్షలకు సిద్ధం కావాలని సంకీర్ణ ప్రభుత్వం అభ్యర్థులకు తెలిపింది. అయితే, ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు మెగా డీఎస్సీ నిర్వహణపై ప్రశ్నలు అడిగారు. దీనితో, మంత్రి నారా లోకేష్ సభలో నాల్గవ ప్రశ్నకు సమాధానమిస్తూ, వైఎస్ఆర్సీపీ సభ్యులు సభలో లేకున్నా, ఈ మెగా డీఎస్సీ నిర్వహణ గురించి ప్రశ్నించినప్పటికీ, స్పీకర్ అనుమతితో తాను సమాధానం ఇస్తున్నానని చెప్పారు. 16347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.