Lifestyle: బ్లడ్‌ షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకోవాలి.? నిపుణులు ఏమంటున్నారు..!

మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే మధుమేహాన్ని ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్స, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వీలైనంత త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అందుకే రెగ్యులర్ గా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బ్లడ్ షుగర్ పరీక్ష ఎప్పుడు చేయాలి? మీరు ఏ సమయంలో సరైన ఫలితాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం..

* ఏదైనా ఆహారం తీసుకునే ముందు షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. నిపుణులు ఉదయం నిద్రలేచిన తర్వాత రక్తంలో చక్కెరను తనిఖీ చేయాలని సిఫార్సు చేస్తారు.

Related News

* అలాగే తిన్న రెండు గంటల తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది సరైన ఫలితాన్ని ఇస్తుంది.

* ఆహారం తీసుకునే ముందు షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ మోతాదు తీసుకోవడంలో సహాయపడుతుంది.

* విపరీతమైన దాహం, ఆయాసం, తరచుగా మూత్రవిసర్జన, తలనొప్పి, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్తపరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* వ్యాయామానికి ముందు, తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు. దీని కారణంగా, రక్తంలో చక్కెర స్థాయిలను సరిగ్గా అంచనా వేయవచ్చు.

* తినడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయిలు 80-130 mg/dL ఉండాలి అని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ పేర్కొంది. అదే సమయంలో, తినడం తర్వాత 1-2 గంటల తర్వాత 180 mg/dL కంటే తక్కువగా ఉండాలి.

గమనిక: పై సమాచారం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహాలు పాటించడం మంచిది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *