500rs Notes: నోట్ల రద్దు అంటూ పోస్ట్లు వైరల్… కేంద్రం చెప్పింది ఇదే…

రూ. 500 నోట్ల రద్దుకు సంబంధించి యూట్యూబ్‌లో వైరల్ వార్త చక్కర్లు కొడుతోంది. మార్చి 2026 నాటికి నోట్లు చెల్లవని తప్పుడు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం దీనిని పూర్తిగా అవాస్తవమని ఖండించింది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

RBI అలాంటి ప్రకటన చేయలేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది
ప్రస్తుత రూ. 500 నోట్లు చెల్లుబాటులో ఉంటాయి. నకిలీ వార్తలను ప్రజలు నమ్మవద్దని లేదా షేర్ చేయవద్దని సూచించారు.‌

దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్న ప్రస్తుత రూ. 500 కరెన్సీ నోట్లను దశలవారీగా వచ్చే ఏడాది మార్చి నాటికి రద్దు చేస్తామని సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఒక యూట్యూబ్ ఛానెల్స్ లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Related News

వివరాల్లోకి వెళితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 100 రూపాయల సర్క్యులేషన్‌ను పూర్తిగా నిలిపివేస్తుందని పేర్కొంటూ ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో విస్తృతంగా ప్రచారం చేయబడుతోంది. మార్చి 2026 నాటికి 500 నోట్లు కూడా చెల్లెలు అని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ప్రజల్లో కొంత ఆందోళన కలిగించినందున, కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిని గమనించింది. ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని మరియు దానిలో నిజం లేదని తేల్చింది.

ఈ నకిలీ ప్రచారం గురించి ప్రజలను హెచ్చరిస్తూ, PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం తన అధికారిక ‘X’ ఖాతాలో ఒక పోస్ట్‌ను పోస్ట్ చేసింది. “RBI అలాంటి ప్రకటన చేయలేదు. రూ. 500 నోట్లు ఉపసంహరించబడవు. అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి” అని ప్రకటన స్పష్టంగా పేర్కొంది. ఇటువంటి నిరాధారమైన మరియు తప్పుదారి పట్టించే వార్తలను నమ్మవద్దని కేంద్రం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఏదైనా వార్తను నమ్మే ముందు లేదా ఇతరులతో పంచుకునే ముందు దాని ప్రామాణికతను అధికారిక వనరుల ద్వారా ధృవీకరించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అటువంటి పుకార్లను నమ్మవద్దని మరియు RBI లేదా కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు అనవసరంగా ఆందోళన చెందవద్దని సూచించింది.