AP Cyclone Alert: బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. భారత వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక జారీ చేసింది. ఈ తుఫాను వల్ల దేశంలోని 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తుఫాను ప్రభావం ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఫిబ్రవరి 19న ఈశాన్య భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిబ్రవరి 19న అస్సాం మరియు మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
వచ్చే వారం అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో హిమపాతం కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ హిమపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 17, 19 మధ్య రాజస్థాన్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాలలో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Related News
ఇంతలో.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఉదయం 11 గంటలకు ముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత ఐదు, ఆరు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలిలో తేమ చాలా తక్కువగా ఉంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఫిబ్రవరిలో ఎండలు ఇలాగే మండిపోతుంటే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.