ఇంట్లో దోశ పిండి ఉండడం సాధారణమే. చాలా మంది ఒకేసారి ఎక్కువ దోశ పిండి తయారు చేసి, వారం రోజుల వరకు ఫ్రిజ్లో నిల్వ చేస్తుంటారు. కానీ కొన్ని రోజుల్లో ఆ పిండి బాగా పులిసిపోతుంది. అప్పుడు దోశ వేసుకునేందుకు ఉపయోగించలేరు. అలాంటి సమయంలో చాలా మంది ఆ పిండిని పారేసేస్తుంటారు. మీరూ అలాగే చేస్తున్నారా? అయితే ఆ పిండిని పడేయకుండా ఈ స్పెషల్ రెసిపీ ట్రై చేయండి. పులిసిన పిండితో “పునుగులు” చేస్తే.. అవి అద్భుతంగా, క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. మిగిలినవాళ్లంతా మీ చేతి వంట గురించి పొగడకుండా ఉండలేరు!
ఈ పునుగులు చాలా తక్కువ టైమ్లో తయారవుతాయి. బాగా పులిసిన దోశ పిండితో చేస్తే మరింత రుచిగా ఉంటాయి. పిండిలో ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర వంటివి వేసి బాగా కలపాలి. అలా కలిపిన పిండిలో కొంచెం మైదా, బియ్యప్పిండి, పావు టీస్పూన్ సోడా కూడా కలిపితే పునుగులకు ఆ కరకరలాడే టెక్స్చర్ వస్తుంది. పిండిని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టడం వల్ల మొత్తం పదార్థాలు బాగా కలిసిపోతాయి. దాంతో పునుగులు బయట నూనె పీల్చకుండా లోపల నుంచీ నైస్గా వేగుతాయి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడిగా అయిన తర్వాతే పిండిని చెంచాతో కొద్దికొద్దిగా వేసుకోవాలి. మొదట ఒక్క నిమిషం కలపకుండానే ఉండనివ్వండి. తర్వాత నెమ్మదిగా కలుపుతూ మద్యమ మంట మీద బాగా వేయించాలి. పునుగులు బంగారు రంగులోకి మారిన తర్వాత బయటకు తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ప్రక్రియలో మిగిలిన పిండితో కూడా అదే రీతిలో పునుగులు వేయించాలి.
Related Posts
ఇలా రెడీ చేసిన పునుగులను ఏ చట్నీతో అయినా సర్వ్ చేస్తే.. మళ్లీ మళ్లీ తినాలనిపించే టేస్ట్ ఉంటుంది. ఈ పునుగులు పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్లకూ ఇవి లైట్ స్నాక్గా బావుంటాయి. ముఖ్యంగా ఈ పునుగులు ఎక్కువ నూనె పీల్చవు. కారణం, పిండిని ముందే బాగా ప్రిపేర్ చేసిన పద్ధతే.
మీ దగ్గర పులిసిన దోశ పిండి ఉందా? అయితే వెంటనే ఈ రెసిపీ ట్రై చేయండి. ఇవి చూడటానికే ఊరించేలా ఉంటాయి. ట్రై చేయకుండా వదిలేస్తే మాత్రం, నిజంగా ఒక గొప్ప వంటకాన్ని మిస్ అవుతారు!