TGSRTC: మరో 200 కొత్త బస్సులు.. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు హడావిడి

హైదరాబాద్ నగరంలో మరో 200 కొత్త బస్సులు నడపడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. వీటిలో దాదాపు 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని తెలిసింది. ఇప్పటికే నగరం అంతటా ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుండగా, మరికొన్ని వస్తే.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

TGSRTC: మరో 200 కొత్త బస్సులు..

– జూలై నాటికి వాటిని తీసుకురావాలని RTC యోచిస్తోంది

Related News

హైదరాబాద్ నగరం: గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై నాటికి 200 కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకురావడానికి RTC చర్యలు తీసుకుంది. విద్యాసంస్థలు ప్రారంభం నాటికి వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటిలో దాదాపు 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో, సిటీ బస్సులలో ఆక్యుపెన్సీ 95 నుండి 100 శాతం వరకు నమోదైంది. ప్రధానంగా రద్దీ సమయాల్లో సిటీ బస్సులు ఓవర్‌లోడ్‌తో నడుస్తాయి.

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాట్లాడుతూ.. లోడ్ తగ్గించి, ప్రయాణికుల సంఖ్యను పెంచాలంటే కొత్త బస్సులను అందుబాటులో ఉంచాలని చెబుతున్నారు. టీజీఎస్ ఆర్టీసీ అవసరమైన నిధుల కోసం బ్యాంకులను సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించారు. గ్రేటర్ జోన్‌లో రోజుకు 23 నుంచి 24 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుండగా, వారిలో 14 నుంచి 15 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు.

ఈవీ బస్సుల పెరుగుదల

గ్రేటర్ జోన్‌లో ఆర్టీసీ 3,100 బస్సులను నడుపుతోంది. ఈవీ విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 2025 నాటికి గ్రేటర్ జోన్‌లో 1,000 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో, గ్రేటర్ జోన్‌లోని 25 బస్ డిపోలలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభమయ్యాయి.