Rains: పగలు ఎండలు, రాత్రి వానలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉంది. రోజంతా ఎండలు మండిపోతుండగా, సాయంత్రం వర్షం తీవ్రంగా ఉంది. ఏపీ, తెలంగాణ రెండింటిలోనూ పరిస్థితి అలాగే ఉంది. ఎండలు, వానలతో పాటు గాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వర్షంతో పాటు, గాలికి దెబ్బతిన్న పంటలు నేలపై పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. రాబోయే మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

ఇక, కొన్ని చోట్ల వర్షాలు తీవ్రంగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో పగటిపూట ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొదటగా, ఏపీలో ఉష్ణోగ్రతల విషయానికొస్తే, నిన్న ప్రకాశం జిల్లాలోని నందనమారెళ్లలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత తిరుపతిలోని వెంకటగిరిలో 42.1 డిగ్రీలు, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో 41 డిగ్రీలు, నంద్యాల జిల్లాలోని దొర్నిపాడులో 40.8 డిగ్రీలు, విజయనగరం జిల్లాలోని ధర్మవరంలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Related News

తెలంగాణ విషయానికొస్తే.. ఆదిలాబాద్ జిల్లాలో వేడి ప్రధానంగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆదిలాబాద్‌లో మొత్తం 41 డిగ్రీలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 40.8 డిగ్రీలు, మెదక్‌లో 39.8 డిగ్రీలు, ఖమ్మంలో 38.6 డిగ్రీలు, రామగుండంలో 37.8 డిగ్రీలు నమోదయ్యాయి.