Redmi Note 13 Pro+ : స్టైలిష్‌ లుక్‌, స్టన్నింగ్ ఫీచర్స్‌.. రెడ్‌మీ కొత్త ఫోన్‌ ధరెంతో తెలుసా.?

చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఈ ఫోన్ Redmi Note 13 Pro+ పేరుతో లాంచ్ చేయబడుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ ఫోన్ వచ్చే ఏడాది జనవరి 4న విడుదల కానుంది.

రెడ్ నోట్ 13 ప్రో+ ఫీచర్ల విషయానికి వస్తే, మీడియా టెక్ డైమెన్షన్ 7200 అల్ట్రా ప్రాసెసర్ అందించబడుతుంది. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. IP68 రేటింగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.

స్క్రీన్ విషయానికి వస్తే, ఈ 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్ మరియు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ 16 GB RAM మరియు 512 GB స్టోరేజ్ కలిగి ఉంది.

కెమెరాకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 200 మెగాపిక్సెల్‌తో కూడిన వెనుక కెమెరాను అందించింది. అలాగే, సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడుతుంది. 4K రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 4న విడుదల కానుంది. ధర విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 12 GB RAM మరియు 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,500 గా నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *