రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం 1,24,955 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు, వారి జీతాలు ఏ మార్గదర్శకాల ప్రకారం చెల్లిస్తున్నారు, ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కె.ఎస్. లక్ష్మణరావు, మెందాస వెంకటేశ్వరరావు మరియు బొర్రా గోపిమూర్తి శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల జీతాలు 01-01-1994న విద్యా శాఖ జారీ చేసిన జి.ఓ. నంబర్ 1 ద్వారా వర్తిస్తాయని, విద్యా శాఖ జారీ చేసిన జి.ఓ. నంబర్ 1లోని నిబంధనలను అమలు చేయడానికి సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశామని మంత్రి వివరించారు.
జి.ఓ. నంబర్ 1 ద్వారా వర్తించే ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల జీతాలు: మంత్రి నారా లోకేష్ పోస్ట్