విద్యార్థుల పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.

మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. బోడుప్పల్ శ్రీ బ్రిలియంట్ టెక్నో హై స్కూల్ లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రిన్సిపాల్ రవీందర్ రావు విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రిన్సిపాల్ విద్యార్థులను ప్రిన్సిపాల్ గదికి పిలిచి వారి ప్రైవేట్ భాగాలను తాకడం వల్ల ఇబ్బంది కలుగుతోందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ధర్నాకు దిగాయి. ప్రిన్సిపాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నిందితుడు ప్రిన్సిపాల్ రవీందర్ రావుపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి పూర్తి వివరాలు అందిస్తామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.

ప్రిన్సిపాల్ రవీందర్ రావు వివరణ: అతనిపై వచ్చిన ఆరోపణలు అబద్ధం, అతనిపై 26 సంవత్సరాలుగా తల్లిదండ్రుల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేవని, విద్యార్థిని మందలించడానికి బెల్ట్ పట్టుకుని లాగడం తప్ప అతను దురుసుగా ప్రవర్తించలేదని అన్నారు.