
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులందరూ ఎంతగానే ఎదురుచూస్తున్న 20వ విడత త్వరలో విడుదల కానుంది. మీరు కూడా ఈ పథకానికి లబ్ధిదారుడేనా? అయితే ఈ రాయితీ వచ్చే తేదీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం… ఈ పథకం ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది.
PM-Kisan 20వ విడత విడుదల తేదీ ఎప్పుడంటే?
ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా 20వ విడత డబ్బులు విడుదల చేసే తేదీని ప్రకటించలేదు. కానీ మునుపటి విడతల విడుదల టైం లైన్ని పరిశీలిస్తే, జూన్ చివరి లేదా జూలై 2025 ప్రారంభంలో ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసే అవకాశం ఉంది. అయితే, అధికారిక ప్రకటన కోసం కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది.
ఈ 20వ విడత డబ్బులు అందుకునే రైతులు ఎవరు?
20వ విడతను పొందాలంటే మీ e-KYC తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. e-KYC పూర్తయ్యాకే రైతుల బ్యాంకు ఖాతాలో ఈ డబ్బులు జమ అవుతాయి. మీరు ఇంకా KYC పూర్తి చేయకపోతే వెంటనే పూర్తిచేయండి.
[news_related_post]e-KYC చేసుకోవడం ఎలా?
pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.. హోమ్పేజీలో “e-KYC” అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.. ఆadhar నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.. తర్వాత, మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి “Get OTP” ఆప్షన్ను క్లిక్ చేయాలి..మీ ఫోన్కు వచ్చిన OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే KYC పూర్తి అవుతుంది.
PM-Kisan 20వ విడత స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి..”Farmer Corner” సెక్షన్లోకి వెళ్లాలి..”Beneficiary Status” అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి.. అడిగిన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి..మీ స్థితి చూపించే పేజీ ఓపెన్ అవుతుంది.