కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆదాయపు పన్నుపై కీలక ప్రకటన చేశారు.
మధ్యతరగతి మరియు జీతాలు పొందే వారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త అందించారు. ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ. 12 లక్షల వరకు ఆదాయంపై రాయితీ ప్రకటించారు. అదనంగా, కొత్త ఆదాయపు పన్ను వ్యవస్థలో స్లాబ్లను మార్చారు. దీనికి మరో రూ. 75 వేలు జోడిస్తే, రూ. 12,75,000 వరకు పన్ను ఉండదు.
కొత్త పన్ను వ్యవస్థలో మారిన స్లాబ్లు..
Related Posts
28
May
- రూ. 0-4 లక్షలు – సున్నా
- రూ. 4-8 లక్షలు – 5%
- రూ. 8-12 లక్షలు – 10%
- రూ. 12-16 లక్షలు – 15%
- రూ. 16-20 లక్షలు – 20%
- రూ. 20-24 లక్షలు – 25%
- రూ. 24 లక్షల కంటే ఎక్కువ 30 శాతం