ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి లో ప్రజలను వుద్దేశించి మాట్లాడుతూ మధ్యలో సడన్ గా తెలుగులో మాట్లాడి అందరిని ఆనందం లో ముంచెత్తారు..
ఏ సందర్భం లో మోడీ గారు ఏమన్నారో తెలుసా ?
చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు..
‘‘కొత్త టెక్నాలజీ తనతోనే మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారు. నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీని బాబు ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. కొందరిని అధికారుల్ని పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించా. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. వాటిని త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే అది సాధ్యం అన్నారు . పెద్ద పెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత ఈ దేశంలో లేరు అని ప్రధాని అన్నారు.
పవన్ కళ్యాణ్ జీ.. ఇది మనమే చేయాలి..
‘‘NTR అభివృద్ధి చెందిన ఏపీ గురించి కలలు కన్నాడు. ఆయన కలలను నిజం చేయడానికి మనమందరం కలిసి రావాలి. ఏపీ అభివృద్ధి చెందిన భారతదేశానికి వృద్ధి ఇంజిన్గా మారాలి. పవన్ కళ్యాణ్ గారూ,ఇది మనం చెయ్యాలి, ఇది మనమే చేయాలి. . భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం వేల కోట్ల రూపాయలు అందిస్తోంది. ఇప్పుడు నేను పవిత్ర భూమి అమరావతిపై నిలబడి ఉన్నప్పుడు, నేను చూస్తున్నది కేవలం నగరం మాత్రమే కాదు. ఒక కల నెరవేరుతున్నట్లు నాకు అనిపిస్తుంది. నేను దాదాపు రూ. 60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు పునాది రాళ్ళు వేసి ప్రారంభించాను. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఏపీ పురోగతి, ఆశలు మరియు ఆకాంక్షలకు బలమైన పునాదులు. వీరభద్ర స్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాలకు నమస్కరిస్తున్నాను మరియు ఏపీ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు మరియు పవన్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ”అని ఆయన అన్నారు.
బ్రదర్ @PawanKalyan ,చంద్రబాబు గారు
ఇది మనం చెయ్యాలి..మనమే చెయ్యాలి
~@narendramodi గారు 😍😍 pic.twitter.com/bDkjz0X8Bf— Team PoliticalSena (@Teampolsena) May 2, 2025
“ఇంద్రలోకం రాజధాని అమరావతి. ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతి. ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి శుభసూచకం. ఏపీని ఆధునిక మరియు అభివృద్ధి చెందిన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతి. అమరావతి ఒక నగరం కాదు.. ఇది ఒక శక్తి. యువత కలలు నిజం చేసే రాజధానిగా ఈ నగరం ఎదుగుతుంది. ఐటీ, కృత్రిమ మేధస్సుతో సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుంది. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, వైద్యానికి అమరావతి కేంద్రంగా మారుతుంది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం సహకరిస్తుంది, ”అని ఆయన అన్నారు.