రోడ్డు ప్రమాదంలో MLC షేక్‌ సాబ్జీ గారు దుర్మరణం. కారణాలు ఇవే..

ఏలూరు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడ మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. భీమవరంలో అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ ఏలూరు నుంచి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, డ్రైవర్‌, గన్‌మెన్‌, ఆయన పీఏ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అత్యవసర వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఏఎస్సై సూర్యనారాయణ, ఎంపీడీఓ కొండలరావు, ఇతర అధికారులు సందర్శించి పరిశీలించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మంత్రివర్గం సంతాపం

మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ మృతి వార్త తెలియగానే సీఎంతో పాటు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ప్రజాసేవలోనే చివరి ఘడియలు గడిపారు: చంద్రబాబు

పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా విషాదకరం. అంగన్ వాడీల పోరాటానికి మద్దతు తెలుపుతూ అనంతలోకాలకు వెళ్లడం బాధాకరమన్నారు. ప్రజాసేవలో చివరి ఘడియలు గడిపిన షేక్ సాబ్జీ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇదే ప్రస్థానం..

షేక్ సాబ్జీ 1966లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. షేక్ కబీర్షా మరియు షేక్ సైదా బాబీ తల్లిదండ్రులు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ సాబ్జీ పనిచేశారు. ఏలూరు మండలం మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2019 ఫిబ్రవరిలో సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేపట్టారు. ఆయన తండ్రి, తాత, ముత్తాత కూడా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *