మార్చిలోనే మాడు పగులిద్ది…. IMD హెచ్చరిక

ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు శివ..శివ అని జపిస్తే చలి తగ్గుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఈ ఏడాది (2024) ఫిబ్రవరిలో వేడి మొదలైంది. మార్చి నుంచి మే వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయువ్య భారతం, ఈశాన్య భారతం, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని IMD తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ ఏడాది భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్రమైన చెమటలు పట్టే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వాతావరణ శాఖ ప్రకారం, మార్చి మొదటి వారంలో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మరియు ఉత్తర మధ్యప్రదేశ్‌లో రుతుపవన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. మార్చి 2న తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కూడా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.

Related News