బంగాళాఖాతంలో అల్పపీడనం… వేడెక్కనున్న AP

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వీటి జోరు రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఎండాకాలంలా ఉండడంతో పాటు గాలి వీచకపోవడంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వెంటనే మరల మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ సమీపంలో స్థిరంగా ఉంది.

మరో రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తర్వాత అది తుఫానుగా బలపడి జార్ఖండ్ మరియు బెంగాల్ పరిసర ప్రాంతాల మీదుగా కదులుతుంది. అల్పపీడనానికి తోడు సముద్ర మట్టానికి నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా తేమ గాలులు వీచిపోయాయని, ఈ ప్రభావం మూడు రోజుల పాటు ఉంటుందని, ఎండతీవ్రత తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఎండలకు అల్లాడిపోతున్న ప్రజలు మరింత తీవ్రమైన హీట్ స్ట్రోక్‌కు గురవుతున్నారు.

Related News

ఆగ్నేయ అరేబియా సముద్రానికి ఆనుకుని దక్షిణ కేరళ తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి దాదాపు ఆరు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కర్నాటక, కొంకణ్ తీర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.