వృద్ధాప్యంలో నెలకు ₹5,000 పింఛన్… మీరూ ఈ ప్లాన్ చేసారా?…

ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయాన్ని పొందాలనే ఆలోచనలో ఉంటారు. పింఛన్ ద్వారా నెలనెలా డబ్బు వస్తుంది, అది కూడా భద్రతతో వస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అద్భుత పథకం ఆటల్ పెన్షన్ యోజన.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ స్కీమ్‌ ద్వారా మీరు నెలకు కనీసం ₹1,000 నుంచి గరిష్ఠంగా ₹5,000 వరకూ పింఛన్ పొందవచ్చు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే భద్రతతో కూడిన పెట్టుబడి మార్గం. 60 ఏళ్ల తరువాత మీకు నెలనెలా పింఛన్ రూపంలో ఆదాయం వస్తూ ఉంటుంది. ఇది మీరు ఇప్పటినుండే పెట్టుబడి చేస్తేనే సాధ్యం.

ఈ స్కీమ్‌ లో ఎవరు చేరవచ్చు?

ఈ యోజనలో 18 నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు చేరవచ్చు. మీరు 18 ఏళ్ల వయసులో చేరితే కేవలం ₹210 నెలవారీగా చెల్లిస్తే చాలు. 60 ఏళ్ల వయసులో మీరు నెలకు ₹5,000 పింఛన్ పొందవచ్చు. ఇది జీవితాంతం మీకు ఆర్థిక భద్రత కలిగిస్తుంది.

Related News

ఎలా చేరాలి?

మీకు దగ్గరలోని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లాలి. సంబంధిత అధికారిని కలవాలి. ఆటల్ పెన్షన్ యోజనకు అప్లై చేయాలి.ఆధార్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ లాంటి వివరాలు ఇవ్వాలి.

మీరు ఎంచుకున్న పథకం ప్రకారం ప్రీమియం అం‍శాన్ని మీ అకౌంట్ నుండి ప్రతి నెల ఆటోమేటిక్‌గా డెడక్ట్ చేస్తారు.

పథకం ఎంపిక ఎలా చేయాలి?

ఈ పథకం లో ₹1,000, ₹2,000, ₹3,000, ₹4,000, ₹5,000 పింఛన్ ఎంపికలు ఉన్నాయి. మీరు ఎంచుకున్న ప్లాన్‌కు తగినంత నెలవారీగా ప్రీమియం చెల్లించాలి. ఒకసారి స్కీమ్‌ను ఎంచుకున్నాక, బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేస్తారు. పైన పేర్కొన్న మొత్తాలు మీ వయస్సును బట్టి మారవచ్చు.

ప్రత్యేకతలు ఏంటి?

ప్రభుత్వం నడిపే స్కీమ్ కనుక పూర్తి భద్రత ఉంటుంది.పెన్షన్ లభించేది నిర్ధారితం.పన్ను మినహాయింపు లభిస్తుంది.భార్యభర్తలిద్దరూ వేరుగా ప్లాన్ చేయవచ్చు – ఇద్దరికీ వేరువేరు పింఛన్.

ముగింపు మాట

ఇప్పుడే ఆటల్ పెన్షన్ యోజనలో చేరితే, వృద్ధాప్యంలో మీరు ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. నెలకు ₹5,000 స్థిర ఆదాయం మీకు భద్రత కలిగిస్తుంది. కేవలం ₹210 పెట్టుబడితో జీవితాంతం లాభం పొందే అవకాశం. ఆలస్యం చేయకుండా ఇప్పుడే బ్యాంక్‌కి వెళ్లి ఈ స్కీమ్‌లో చేరండి.