Kidney Stones: నీళ్లు తక్కువ తాగినా.. వీటిని ఎక్కువతిన్నా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

నీళ్లు తక్కువగా తాగడం.. ఈ 5 ఆహారాలను ఒకేసారి ఎక్కువగా తింటే.. Kidney stones పేరుకుపోతాయి. కాబట్టి మీరు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మూత్రం పసుపు రంగుతో పాటు మూత్రంలో దుర్వాసన రావడం, మూత్రంలో రక్తం కారడం, మూత్ర విసర్జన సమయంలో మంటలు రావడం వంటి సమస్యలు ఉంటాయి. రోజుకు 3 లీటర్ల కంటే తక్కువ నీరు తాగడం వల్ల kidney problems వస్తాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Kidney stones పొత్తి కడుపులో, వెనుక పక్కటెముకలకి రెండు వైపులా తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. రోజుకు 3 లీటర్ల కంటే తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. Kidney stones మీ మూత్ర నాళంలో ఏదైనా భాగాన్ని ప్రభావితం చేయవచ్చు.

కిడ్నీలను కాపాడేది నీళ్లే కాదు.. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగితే సరిపోదు.. ఈ ఐదు రకాల ఆహారానికి దూరంగా ఉండాలి.

Related News

ఆక్సలేట్లు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు. బచ్చలికూర, బీట్రూట్, బంగాళదుంపలు, పప్పులు, చాక్లెట్లు, వేరుశెనగ వంటి ఆహారాలను ఎక్కువగా తినవద్దు.

ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, పెద్దలు రోజుకు 5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలు అలాగే బహుళ అవయవాలు దెబ్బతింటాయి.

కిడ్నీ సమస్యలకు జంతు ప్రోటీన్ను నివారించడం ఉత్తమం. జంతు మాంసకృత్తులు ఎక్కువగా తినడం వల్ల
Kidney stones ఏర్పడే ప్రమాదం ఉంది.

మంచి ఆరోగ్యానికి విటమిన్ సి అవసరం. అయితే విటమిన్ సి ఎక్కువగా పెరిగితే Kidney stones ఏర్పడే ప్రమాదం ఉంది. కూరగాయలు మరియు పండ్ల ద్వారా శరీరంలో విటమిన్ సి లోపాన్ని పూరించండి. విటమిన్ సి మాత్రల మోతాదు విషయంలో జాగ్రత్తగా ఉండండి.

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. Kidney stones ఏర్పడవచ్చు. Fast Foods తినడం మానేసి ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు 4 లీటర్ల నీరు త్రాగాలి.