JEE Advanced 2024 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదల , ఫైనల్ ఆన్సర్ ‘కీ’ డైరెక్ట్ లింక్ ఇదే

JEE Advanced 2024 Results:: దేశంలోని IIT లు మరియు ఇతర ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ల కోసం మే 26న నిర్వహించిన JEE Advanced ఫలితాలు విడుదలయ్యాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఐఐటీ మద్రాస్ జూన్ 9 ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి.

విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు.

ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఈ ఏడాది మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది వరకు పరీక్షకు హాజరయ్యారు.

JEE అడ్వాన్స్‌డ్ – 2024 ఫలితాలను ఇలా తనిఖీ చేయండి..

  1. * ఫలితాల కోసం విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. – https://jeeadv.ac.in/
  2. * హోమ్‌పేజీలో JEE (Advanced) 2024 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
  3. * విద్యార్థులు తమ రూల్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను ఫలితాలకు సంబంధించిన లాగిన్ పేజీలో నమోదు చేయాలి.
  4. * జేఈఈ అడ్వాన్స్‌డ్ – 2024 ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  5. * ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒక ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో ఉపయోగం కోసం ఉంచండి.

JEE అడ్వాన్స్‌డ్ – 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో అర్హత సాధించిన 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్న సంగతి తెలిసిందే.

జేఈఈ మెయిన్ తుది ఫలితాలు ఏప్రిల్ 25న ప్రకటించగా… JEE Advanced దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమైంది. మే 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో పరీక్షను నిర్వహించింది. మే 31న ఐఐటీ మద్రాస్ జేఈఈ అడ్వాన్స్‌డ్ – 2024 పరీక్ష రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

జేఈఈ అడ్వాన్స్‌డ్ – 2024కి సంబంధించిన పేపర్-1, పేపర్-2 ప్రశ్నాపత్రాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ జూన్ 2న విడుదల కాగా.. జూన్ 3న సాయంత్రం 5 గంటలకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. తాజా ఫలితాలను జూన్ 9న ప్రకటించారు.

జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్.

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరుతో ఉమ్మడి కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం.. జూలై 23 వరకు 44 రోజుల పాటు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.ఎన్ఐటీల్లో దాదాపు 24 వేలు, ఐఐటీల్లో 17,385 సీట్లు, ట్రిపుల్ ఐటీల్లో మరో 16 వేల సీట్లను జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ద్వారా భర్తీ చేస్తారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్‌తో పాటు బోర్డు పరీక్షల్లో అభ్యర్థులు 75 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. ఈసారి ఉమ్మడి సీట్ల కేటాయింపు అథారిటీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యాసంస్థల సంఖ్య పెరిగింది. గతేడాది 114 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 121కి పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *