ఏ ఉద్యోగానికి వెళ్లినా రిటైర్ అయిన తర్వాత భద్రతే ముఖ్యం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏప్రిల్ 1 నుంచి “Unified Pension Scheme (UPS)” పేరుతో కొత్త పింఛన్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులు నెలకు కనీసం ₹10,000 పింఛన్ పొందే అవకాశం ఉంది. కానీ కొన్ని అర్హతలు ఉండాలి.
ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటి అంటే
పాత పింఛన్ స్కీమ్ (OPS) మరియు న్యూ పింఛన్ స్కీమ్ (NPS) రెండింటికి మధ్య సమతుల్యత ఉండేలా రూపొందించారు. ఉద్యోగులు ఇప్పుడు NPS లేదా UPS మధ్య ఎంచుకునే అవకాశం పొందారు.
ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది?
ఈ స్కీమ్ కింద, ఉద్యోగి తన ప్రాథమిక జీతంలో 10% చెల్లిస్తాడు. దానికి అదనంగా ప్రభుత్వం 18.5% సాయం చెల్లిస్తుంది. అంటే, నెలకు ఉద్యోగి ₹1,000 వెచ్చిస్తే, ప్రభుత్వం దానిపై ₹1,850 చెల్లిస్తుంది. ఈ మొత్తం రిటైర్మెంట్ తర్వాత పింఛన్ రూపంలో తిరిగి వస్తుంది.
Related News
పూర్తి అర్హతలు
ఉద్యోగికి కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉండాలి.,25 ఏళ్ల సర్వీస్ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవారూ ఈ స్కీమ్లోకి వస్తారు.,FR 56(j) కింద పెనాల్టీ లేకుండా రిటైర్ అయినవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది.
ఎవరికి ఈ స్కీమ్ వర్తించదు?
10 ఏళ్ల కంటే తక్కువ ఉద్యోగ సేవ ఉన్నవారు,ఉద్యోగం నుండి తొలగించబడ్డవారు, స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలేసినవారు.
పింఛన్ ఎలా లభిస్తుంది?
ఈ స్కీమ్ కింద ఉద్యోగి బేసిక్ జీతం + డి.ఏ ఆధారంగా పింఛన్ లెక్కిస్తారు. రిటైర్మెంట్ సమయంలో ఒకసారి లంప్సమ్ అమౌంట్ కూడా లభిస్తుంది. నెలకు కనీసం ₹10,000 పింఛన్ ఖచ్చితంగా లభిస్తుంది.
ఫ్యామిలీ పింఛన్ ఎలా ఉంటుంది?
ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు 60% పింఛన్ లభిస్తుంది. అంటే వారికి నెలకు కనీసం ₹6,000 పింఛన్ ఖచ్చితంగా వస్తుంది.
ముఖ్యమైన సూచన
ఇప్పుడు మీరు ఈ స్కీమ్ను ఎంచుకుంటే భవిష్యత్ భద్రత ఖాయం. నెలకు ₹1,000 పెట్టుబడి పెడితే, రిటైర్మెంట్ తర్వాత ₹10,000 స్థిర ఆదాయం లభిస్తుంది. ఆలస్యం చేస్తే ఈ అవకాశాన్ని కోల్పోతారు.