Airtel: ఇండియాలో ఫస్ట్ ఆల్-ఇన్-వన్ ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్..

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ OTT ప్రియులకు పెద్ద శుభవార్త ప్రకటించింది. ఇది మంగళవారం ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం దేశంలో మొట్టమొదటి ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్యాక్ నెట్‌ఫ్లిక్స్, జియోసినిమా, జీ5, సోనీలైవ్, మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌తో సహా 25 కి పైగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ఒకే రీఛార్జ్‌తో యాక్సెస్‌ను అందిస్తుందని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

చందాదారులు నెలకు రూ. 279 ప్రారంభ ధరకు ఈ ప్యాకేజీని పొందవచ్చు. ఈ ప్రారంభ OTT ప్యాకేజీ రూ. 750 విలువైన ప్రయోజనాలను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. దీనితో పాటు, 28 రోజుల చెల్లుబాటుతో రూ. 598 మరియు 84 రోజుల చెల్లుబాటుతో రూ. 1,729 ప్లాన్‌లు కూడా ఉన్నాయి. అన్ని ప్లాన్‌లను ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

దేశీయ టెలికాం రంగంలో విపరీతమైన పోటీ ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన ప్లేయర్ రిలయన్స్ జియోతో పోటీ పడటానికి మరియు కస్టమర్లను ఆకర్షించడానికి ఎయిర్‌టెల్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత వారం, గూగుల్‌తో భాగస్వామ్యంతో పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ వన్ స్టోరేజ్ సేవలను గూగుల్ ప్రారంభించింది.

Related News