ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు.. ఇలా బుక్ చేసుకోండి ..

ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు ఇసుకను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కీలక హామీ సోమవారం నుంచి అమలవుతోంది. July  8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇసుక తవ్వకాలు, దృశ్యాలు, రవాణా ఛార్జీలు వంటి నామమాత్రపు రుసుములను వినియోగదారులు చెల్లించాలి. ఇసుకను ఉచితంగా పొందేందుకు డిజిటల్ విధానంలో బుకింగ్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇందుకోసం నగదు లావాదేవీలు లేకుండానే డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా డిజిటల్ చెల్లింపుల ద్వారా వినియోగదారులకు ఇసుకను ఉచితంగా అందజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఇసుక డంపులు ఉన్న స్టాక్ పాయింట్ల దగ్గర సోమవారం నుంచి ఈ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో ఇది అందుబాటులో లేదు. డిజిటల్ చెల్లింపుల కోసం 16 జిల్లాల్లో ఉచిత ఇసుక పాలసీ బ్యాంకు ఖాతాలు తెరిచారు.

ఇసుక లభ్యతతో సహా ఇసుక స్టాక్ పాయింట్లు గనుల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచబడతాయి. ఉచిత ఇసుక విక్రయాల వివరాలు ప్రతిరోజూ అప్‌డేట్ చేయబడతాయి. నేటి నుంచి రెండు వారాల పాటు చేతిరాత రూపంలో బిల్లులు.. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో కూడా జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి, ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుక ఇవ్వనున్నారు. పైగా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లి ప్రైవేట్‌గా విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *