ఈ తరం ప్రేక్షకులకు హీరోయిన్ సౌందర్య గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 1990లలో సౌందర్య తెలియని సినీ అభిమాని ఉండరు. సౌందర్య అందంతో ప్రతిభతో అన్ని వర్గాల ప్రజలని మెప్పించిన హీరోయిన్ .
అందం అభినయం ఇంకా అదృష్టం సౌందర్య ను స్టార్ హీరోయిన్ చేశాయి . కన్నడ చిత్రంతో హీరోయిన్గా అరంగేట్రం చేసిన సౌందర్య 1993లో మనవరాలి పెళ్లి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకుంది.
అయితే, సౌందర్యకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు వంటి చిత్రాల్లో ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్యకు అవకాశాలు ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. దీనివల్ల సౌందర్యకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ద్వారా ఆమె నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. తరువాతి తరం హీరోయిన్లు ప్రవేశించే కొద్దీ, సౌందర్య అవకాశాలు తగ్గాయి. ఈ సమయంలో సౌందర్య తీసుకున్న ఓ నిర్ణయం ఆమె మరణానికి దారి తీసింది.
సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో సౌందర్య రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె బీజేపీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పార్టీ తరపున ప్రచారం చేయాలని ఆమె ప్లాన్ చేసుకున్నారు. బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా సౌందర్య విమాన ప్రమాదంలో పడింది. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా చనిపోయాడు.
ఈ విషయంలో సౌందర్య చాలా మంది హీరోలతో నటించినా.. ఒక హీరోని మాత్రం బాగా ప్రేమించింది. ఆ హీరో మరెవరో కాదు ఫ్యామిలీ హీరో జగపతిబాబు. అవును, జగపతిబాబు అంటే సౌందర్యకు చాలా గౌరవం. వీరిద్దరూ కలిసి దాదాపు 10 సినిమాల్లో నటించారు.
‘‘అంతపురం, శుభలగ్నం, ప్రియరాగాలు, అల్లరి ప్రేమికుడు, మూడు ముక్కలాట, పెళ్లి పీటలు, సర్దుకుపోదాం రండి, భలే బుల్లోడు, చిలకపచ్చ కాపురం, దొంగాట’’.. ఇలా చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే, అదే సమయంలో, వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని పుకార్లు వచ్చాయి. జగపతి బాబుకు అప్పటికే వివాహం జరిగింది. సౌందర్యపై తనకున్న ప్రేమను జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆమె మరణం తర్వాత కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.