రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఈ ఏడాది పాత ఫీజులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC) బుధవారం సమావేశమైంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై చర్చించారు. 2025-27 రాబోయే మూడేళ్ల బ్లాక్ పీరియడ్ కు ఫీజులను నిర్ణయించాల్సి ఉంది.
అయితే, TAFRC అధికారులు సరైన ఫీజు ప్రతిపాదనలు చేయకపోవడంతో, ఈ ఏడాది ఫీజుల పెంపును నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని కాలేజీల్లో ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దానిని సమీక్షించడానికి సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాతే ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిసింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సమావేశం జరిగిన విషయం తెలిసిందే, ఫీజులను సరిగ్గా పెంచకపోవడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.